తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. మూడు రోజుల పాటూ ఆర్జిత సేవలు రద్దు

Wait 5 sec.

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమని.. మార్చి 30 నుంచి ఏప్రిల్ 01 తేదీ వరకు (మూడు రోజులపాటు) స్వామివారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా మూడు రోజుల పాటూ చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వసంతోత్సవాలలో భాగంగా మార్చి 30వ తేదీన ఉదయం 6.30 గంటలకు నాలుగు మాడవీధులలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు ఊరేగిస్తారు.. ఆ తర్వాత వసంతోత్సవ మండపానికి వేంచేపు చేసి వసంతోత్సవ అభిషేక నివేదనల తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు.వసంతోత్సవాలలో మార్చి 31న రెండవరోజు శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం వసంత మండపంలో స్వామివారిని వేంచేపు చేసి అర్చకులు వైభవంగా వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. వసంతోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 01న చివరిరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.ఈ వసంతోత్సవాలవాలలో భాగంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఈ మేరకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. అయితే ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవమని పేరు వచ్చింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని లో మార్చి 30 నుంచి ఏప్రిల్ 01వ తేదీ వరకు మూడురోజుల పాటు ఆర్జిత సేవలు రద్దయ్యాయి. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను, మార్చి 31న అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.తిరుపతిలో గజవాహన సేవతిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటలకు స్వామివారు గజ వాహనంపై విహరించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు. హైందవ సనాతన ధర్మంలో గజ వాహనానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. రణరంగంలో గానీ, రాజదర్బారుల్లో గానీ, ఉత్సవాల్లో గానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహనసేవలో గజేంద్రుడు రాములవారిని వహించునట్లు భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై వహించి స్వామికృపకు పాత్రులుకాగలరు. వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ సురేష్, అర్చ‌కులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.