: అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసి అన్ని దేశాలను ఇబ్బంది పెడుతుంది. ఈక్రమంలోనే ఈ కీలక జలమార్గాన్ని సురక్షితం చేసేందుకు ట్రంప్ మిత్ర దేశాలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా తమకు మద్దతు తెలుపుతూ అక్కడకు యుద్ధనౌకలు పంపాలని మొత్తంగా ఏడు దేశాలకు చెప్పారు. కానీ మిత్రదేశాల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటో కూటమి సహా ఇతర మిత్రపక్షాల గురించి మాట్లాడుతూ... తమకు ఎవరి సాయమూ అవసరం లేదని తేల్చి చెప్పారు. అలాగే ఇరాన్‌తో యుద్ధానికి ఎవరూ సాయం చేయకపోయినా.. అన్ని దేశాలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. మాకెవరి సాయమూ అక్కర్లేదు..!సెయింట్ పాట్రిక్స్ డే సందర్భంగా ఐర్లాండ్ ప్రధాని మీహాల్ మార్టిన్‌కు ఆతిథ్యం ఇచ్చిన అనంతరం ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. "నిజానికి మాకు ఎవరి సాయం అవసరం లేదు. యూరప్ రక్షణ కోసం అమెరికా వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ఉక్రెయిన్ కోసం పదిలక్షల కోట్లు కుమ్మరిస్తోంది. కానీ మాకు అవసరమైనప్పుడు కనీసం రెండు మైన్ స్వీపర్ " అని మండిపడ్డారు.నాటో నుంచి నిష్క్రమణ?నాటో దేశాల వైఖరి పట్ల అసహనంతో ఉన్న ట్రంప్.. ఆ కూటమి నుంచి అమెరికా తప్పుకునే అంశాన్ని పరిశీలించవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. "దీని గురించి కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా నేనే నిర్ణయం తీసుకోగలను. ప్రస్తుతం నా మనసులో ఏమీ లేదు. కానీ.. ప్రస్తుత పరిస్థితులు నాకు అస్సలు నచ్చడం లేదు" అని ఆయన పేర్కొన్నారు. కాగా 2023లో అమెరికా కాంగ్రెస్ చేసిన చట్టం ప్రకారం.. నాటో నుంచి తప్పుకోవాలంటే పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. అయితే ట్రంప్ తన అధ్యక్ష అధికారాలను ఉపయోగించి లొసుగుల ద్వారా దీనిని అధిగమించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పందిస్తూ.. హార్మూజ్ జలసంధి రక్షణకు తాము సిద్ధమే కానీ.. అది అమెరికా-ఇరాన్ యుద్ధంలో భాగంగా ఉండకూడదని స్పష్టం చేశారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. మాక్రాన్ పదవీకాలం త్వరలోనే ముగుస్తుందని ఎద్దేవా చేశారు. మరోవైపు తాము యుద్ధ నౌకలు పంపలేమంటూ తెలిపిన యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌పై కూడా ట్రంప్ నిప్పులు చెరిగారు. అంతేకాకుండా "ఇది మా యుద్ధం కాదు. మమ్మల్ని ఇందులోకి లాగవద్దు" అని ఈయూ విదేశాంగ విధాన చీఫ్ కాజా కల్లాస్ తేల్చి చెప్పారు.ఈక్రమంలోనే సైనిక సాయం లభించకపోయినా ఇరాన్‌ను ఒంటరి చేసేందుకు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వ్యూహాలు రచిస్తోంది. ఇరాన్ విప్లవ దళాలను (ఐఆర్‌జీసీ), హిజ్బుల్లాను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించి ఆంక్షలు విధించాలని ప్రపంచ దేశాలకు అమెరికా రాయబారుల ద్వారా వర్తమానం పంపింది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.