ఇరాన్‌లోని భారతీయులకు మరోసారి హెచ్చరికలు.. టెహ్రాన్‌లో ఎంబసీ కీలక సూచనలు

Wait 5 sec.

ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు, యుద్ధభూమిలో చిక్కుకున్నవారిని సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయ విద్యార్థుల భద్రతపై దృష్టిసారించిన ఇండియన్ ఎంబసీ ఇప్పటికే టెహ్రాన్‌లో ఉన్నవాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇరాన్ సరిహద్దు దాటి, అర్మేనియా వంటి దేశాల మీదుగా స్వదేశానికి చేరుకోవాలనుకునే భారతీయులకు కీలక సూచనలు చేసింది. ఎంబసీకి ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా లేదా సమన్వయం చేసుకోకుండా సరిహద్దుకు చేరుకోవడం లేదా దాటే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దని విజ్ఞప్తి చేసింది.‘‘ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయ సమాజ సభ్యులతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా రాయబార కార్యాలయం పేర్కొంది. ప్రయాణ సంబంధిత లేదా ఇతర విషయాలలో సహాయం అవసరమయ్యే భారతీయ పౌరులకు అండగా నిలిచేందుకు, అవసరమైన ప్రతిచోట సమన్వయంతో కూడిన ఏర్పాట్లు జరుగుతున్నాయి... ఇరాన్‌లో ఉన్న తమ పౌరులు, రాయబార కార్యాలయంతో అధికారిక సంప్రదింపు మార్గాల ద్వారా అనుసంధానమై ఉండాలి.. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.. దీనివల్ల ప్రయాణ సమయంలో పాటించాల్సిన విధానాలు తదితర అంశాలకు సంబంధించి, కచ్చితమైన సమాచారాన్ని.. తగిన మార్గదర్శకత్వాన్ని పొందగలుగుతారు’’ అధికారులు సూచించారు. ‘‘మాకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సరిహద్దుల వైపు వెళ్లొద్దు... ఎంబసీ సహకారం లేకుండా బోర్డర్ దాటి ఇరాన్‌ను వీడేందుకు ప్రయత్నిస్తే.. రవాణా, ఇమిగ్రేషన్‌ విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.. ఒక్కసారి ఇరాన్ దాటిన తర్వాత సాయం కూడా చేయలేని పరిస్థితి నెలకుంటుంది... కాబట్టి ఇరాన్‌లోని భారతీయులు కచ్చితంగా మా సలహాలను పాటించాలి’’ అని రాయబార కార్యాలయం తెలిపింది. చేరుకున్న సంగతి తెలిసిందే. మొదటి దశ తరలింపులో భాగంగా విదేశీ వ్యవహారాల శాఖ, ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం సమన్వయంతో వారు భారత్‌కు సురక్షితంగా చేరుకున్నారు.ఇదిలా ఉండగా, ఇరాన్‌ నుంచి దాదాపు 550 మంది భారతీయులు అర్మేనియాకు చేరుకున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది. వీరిలో 284 మంది యాత్రికులు ఉన్నట్లు పేర్కొంది. మరో 90 మంది అజర్‌బైజాన్‌కు చేరుకున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఈ మేరకు ప్రకటన చేశారు. హర్మూజ్‌ జల సంధిలో నౌకల రవాణాకు భద్రతకు తమకు సహకరించాలంటూ ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విజ్ఞ‌ప్తి చేసిన సంగతి తెలిసిందే. కానీ, ఈ అంశంపై కూడా జైశ్వాల్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదన్నారు.