మంత్రి పదవిపై మాజీ మంత్రి, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి కొత్త కాదని.. ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపై నిర్ణయం తీసుకుంటారన్నారు. గంటా విశాఖలోని ఆశీలుమెట్ట సంపత్‌ వినాయగర్‌ ఆలయంలో ఉగాది సందర్భంగా పూజలు చేశారు. అనంతరం మంత్రివర్గ విస్తరణను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. శ్రీనివాసరావు స్పందించారు. చంద్రబాబు దేశ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు.. ఆయనకు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో బాగా తెలుసన్నారు. సరైన సమయంలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని గంటా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణపై వినిపిస్తున్న వార్తలన్నీ ఊహాగానాలు మాత్రమే అన్నారు.గంటా శ్రీనివాసరావు విశాఖలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరినాలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో కూడా పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు.. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు గంటా శ్రీనివాసరావుతో పాటుగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ కూడా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత.. ఆయన టీడీపీలో చేరి 1999లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచారు. 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున చోడవరం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికలకు ముందు గంటా శ్రీనివాసరావు ప్రజారాజ్యంలో చేరారు.. అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో దక్కింది. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజనతో పాటుగా రాజకీయ పరిణామాలు మారడంతో గంటా శ్రీనివాసరావు 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరారు. గంటా శ్రీనివాసరావు 2014 ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీచేసి విజయం సాధించారు.. మంత్రి పదవి కూడా దక్కింది. గంటా శ్రీనివాసరావు 2019 ఎన్నికల్లో భీమిలి బదులు విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆయన విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. 2024 జనవరి 23న స్పీకర్ ఆమోదించిన సంగతి తెలిసిందే. గంటా శ్రీనివాసరావు 2024 ఎన్నికల్లో మళ్లీ నియోజకవర్గా్న్ని మార్చారు.. మళ్లీ భీమిలి నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాదించిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు మంత్రిగా అవకాశం దక్కలేదు. అయితే ఏపీలో త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో గంటా శ్రీనివాసరావుకు మంత్రిగా అవకాశం దక్కుతుందా అనే చర్చ జరుగుతోంది.