ఎట్టకేలకు శుభవార్త.. EPS కనీస పెన్షన్ పెంచాలని.. కేంద్రానికి పార్లమెంటరీ ప్యానెల్ సూచన

Wait 5 sec.

EPF Pension Hike: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో చందాదారులుగా ఉండే ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పొందే పెన్షన్‌కు సంబంధించి ఎట్టకేలకు శుభవార్త వచ్చింది. కనీస పెన్షన్ పెంపుపై చాలా కాలంగా ఉద్యోగులు, పెన్షనర్లు పోరాటం చేస్తున్నారు. అయితే, ఇన్నాళ్లు కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. కానీ, ఇప్పుడు ఎట్టకేలకు సానుకూల వార్త వచ్చింది. కనీస పెన్షన్ పెంపుపై పార్లమెంటరీ ప్యానెల్ కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసింది. మరి ఆ వివరాలు తెలుసుకుదాం. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ EPS-1995 కింద ప్రస్తుతం అందిస్తున్న కనీస పెన్షన్ రూ.1000 మొత్తాన్ని పెంచాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది. ఈ మొత్తం వాస్తవికంగా, గౌరవప్రదంగా ఉండాలని అభిప్రాయపడింది. ఈ మేరకు లేబర్, టెక్స్ టైల్స్, స్కిల్ డెవలప్మెంట్ పై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 5వ రిపోర్ట్‌లో పలు అంశాలను ప్రస్తావించింది. అందులో కనీస పెన్షన్ పెంపు ప్రధాన అంశంగా ఉంది. ఈపీఎస్ పథకంలో భాగంగా కనీస పెన్షన్ పెంచాలని పెన్షనర్లు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పార్లమెంటరీ కమిటీ ఈ అంశంపై సానుకూల ప్రతిపాదనలు చేయడం ఊరట కల్పించే విషయంగా చెప్పవచ్చు. కోరుతున్నారు. ఇదే డిమాండ్‌తో ఇటీవలే డిళ్లీలోని జంతర్ మంతర్ వద్ద 3 రోజులు ధర్నా సైతం నిర్వహించారు. ఈ క్రమంలోనే పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పందించింది. కనీస పెన్షన్‌పై ఇప్పటికీ పింఛనుదారుల నుంచి పలుమార్లు విజ్ఞాపనలు, వినతి పత్రాలు వచ్చినట్లు గుర్తు చేసింది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, జీవన వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఇస్తోన్న కనీస పెన్షన్ ఏ మాత్రం సరిపోదని కమిటీ అభిప్రాయపడింది. కాబట్టి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995ని పునఃసమీక్షించాలని కోరింది. కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ప్రతిపాదనలు చేసింది. అందుకు తగినట్లుగా కేటాయింపులు చేయాలని సూచించింది. అలాగే లేబర్ కోడ్స్ అమలును కమిటీ స్వాగతించింది. లేబర్ కోడ్స్ అమలులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో శ్వాశ్వత కో-ఆర్డినేషన్, ఇంటరాక్షన్ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ప్రభుత్వం ఇచ్చే వివిధ పథకాల అమలు తీరుతెన్నులనూ ఈ బోర్డు పరిశీలిస్తుందని తెలిపింది. పని ప్రదేశంలో ప్రమాదం జరిగినప్పుడు రెగ్యులర్ వర్కర్ల మాదిరిగానే కాంట్రాక్టు వర్కర్లకు పరిహారం అందడంలో జాప్యం జరుగుతోందని, వారికి సత్వరమే పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద సామాజిక భద్రత ప్రయోజనాలను మరింత మందికి విస్తరించేందుకు ప్రస్తుతం ఉన్న వేతన పరిమితిని తక్షణమే సవరించాలని తెలిపింది.