AP Rains: ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. ఈ జిల్లాలలో పిడుగులతో వానలు.. బీ అలర్ట్..

Wait 5 sec.

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కొనసాగుతున్నాయి. సోమవారం(మార్చి 23) రోజున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా , పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉందని ప్రజలను హెచ్చరించింది. అలాగే బాపట్ల, పల్నాడు జిల్లా, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసేటప్పుడు బహిరంగ ప్రదేశాలు, పొలాల్లో ఉండవద్దని సూచించింది. చెట్ల కింద నిలబడవద్దని, విద్యుత్ స్తంభాల సమీపంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని సూచించింది. మరోవైపు ఏప్రిల్, మే నెలల్లో నమోదవుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉష్ణోగ్రతలతో పాటుగా వడగాలుల ప్రభావం కూడా ఈ ఏడాది అధికంగా ఉంటుందని తెలిపింది. శ్రీకాకుళం, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, నంద్యాల, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, కడప, తిరుపతి జిల్లాలలోని కొన్ని చోట్ల మినహా మిగతా ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, నెల్లూరు జిల్లాలలో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కొబ్బరి నీళ్లు వంటి ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలని.. వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్నారులు అనవసరంగా బయట తిరగవద్దని సూచించింది. మార్చి నెల నుంచే ఈ ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసినప్పటికీ.. ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా వర్షాలు పడుతూ ఉండటంతో కొన్ని జిల్లాల ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.