: మీరు సురక్షిత పెట్టుబడి పథకం కోసం చూస్తున్నారా? మీ దగ్గర కాస్త పెద్ద మొత్తంలో డబ్బులు ఉండి.. ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడి అందుకోవాలని చూస్తున్నారా.. ఇక్కడ . ఇక్కడ ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మెచ్యూరిటీకి ఒకేసారి రాబడి అందుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా వడ్డీ ఇచ్చే స్కీమ్స్ కూడా ఉంటాయి. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీమ్ ఇలాంటిదే కాగా.. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా మరో స్కీమ్ ఆఫర్ చేస్తోంది. అదే ఎస్బీఐ యాన్యుటీ స్కీమ్. ఇక్కడ నెలనెలా వచ్చే డబ్బుల్లో.. అసలు, వడ్డీ రెండూ కలిపి ఉంటాయి. ఇది కూడా ఎలాంటి రిస్క్ ఆఫర్ చేయదు. నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం.. స్థిరంగా రాబడి వస్తుంది. ఇది దీర్ఘకాలంలో మెచ్యూరిటీ సమయంలో కాకుండా ప్రతి నెలా వడ్డీ రూపంలో తీసుకోవచ్చు. ఇక్కడ ఒకేసారి డబ్బును ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనీసం రూ. 1000 నుంచి కూడా పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది. గరిష్ఠ పెట్టుబడి పరిమితి లేదు. ఇక కనీసం 3 సంవత్సరాల నుంచి గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు కొనసాగించొచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా వడ్డీ రేట్లు అంటూ ఏం ఉండవు. టెన్యూర్‌ను బట్టి.. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లే దీనికి కూడా వర్తిస్తాయి. అక్కడ ఎలాగైతే వేర్వేరు కాల పరిమితులకు వడ్డీ రేట్లు వేర్వేరుగా ఉంటాయో.. ఇక్కడ కూడా వడ్డీ రేట్లు అలాగే ఉంటాయని చెప్పొచ్చు. ఇక్కడ మీ డిపాజిట్‌ బ్యాలెన్స్ నుంచి 75 శాతం వరకు లోన్ తీసుకునేందుకు కూడా వీలుంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే వీటిని జారీ చేస్తారని చెప్పొచ్చు. అన్ని ఎస్బీఐ శాఖల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. . ఉదాహరణకు ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ పథకంలో ఒకేసారి రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి.. పదేళ్ల కాల పరిమితి ఎంపిక చేసుకుంటే గనుక.. ఇక్కడ ప్రతి నెలా రూ. 11,354 వస్తుంది. పదేళ్ల పాటు ఇది ప్రతినెలా అందుకునేందుకు వీలుంటుంది. మొత్తంగా పదేళ్లలో మీ చేతికి రూ. 13.62 లక్షలు వస్తాయి. ఇక్కడ పదేళ్ల వ్యవధికి వడ్డీ రేటు ప్రస్తుతం 6.05 శాతంగా ఉంది. ఇది సాధారణ ప్రజలకు కాగా.. సీనియర్ సిటిజెన్లకు వడ్డీ 7.05 శాతంగా ఉండగా.. ఇక్కడ పదేళ్ల కాలానికి రూ. 13.90 లక్షల వరకు వస్తుంది. ఇక్కడ ప్రతినెలా రూ. 11,630 చొప్పున వస్తుంది.