ఆసియాకప్ 2025 ఫైనల్‌లో భారత బౌలర్లు.. పాకిస్థాన్ బ్యాటర్లను కట్టడి చేశారు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ప్రత్యర్థి బౌలర్ల భరతం పట్టారు. ఓ దశలో 84 పరుగులకు కూడా ఒక్క వికెట్ కోల్పోయిన ఆ జట్టును.. కోలుకోలేని దెబ్బ కొట్టారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు తీసి.. 150 పరుగులకు ముందే ఆ జట్టును కుప్పకూల్చారు. భారత బౌలర్ల దెబ్బకు పాకిస్థాన్.. 20 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. చాలా కాన్ఫిడెంట్‌గా పాకిస్థాన్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. అయితే తొలుత వికెట్‌ కాపాడుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చిన దాయాది బ్యాటర్లు.. ఆ తర్వాత వేగం పెంచారు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఓ దశలో పాక్.. 9.3 ఓవర్లలో 84/0తో నిలిచింది. ఓపెనర్లు ఇద్దరూ దూకుడుగా ఆడటంతో టీమిండియా ముందు 200 పరుగుల లక్ష్యం నిలిపేలా కనిపించింది. కానీ సెంచరీ భాగస్వామ్యం దిశగా సాగుతున్న ఈ జోడీని వరుణ్ చక్రవర్తి విడదీశాడు. ఓపెనర్ ఫర్హాన్ (38 బంతుల్లో 57 రన్స్‌)ను క్యాచ్ ఔట్ చేశాడు. ఆ 114 పరుగుల వద్ద ఆయుబ్ (14) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక అప్పటి నుంచి భారత బౌలర్లు పట్టుబిగించారు. కట్టుదిట్టంగా బంతులేస్తూ పాక్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. దీంతో ఒత్తిడికి లోనైనా ఆ జట్టు బ్యాటర్లు.. బ్యాట్‌ను ఇష్టం వచ్చినట్లు ఊపుతూ.. క్యాచ్‌ ఔట్‌లు అయ్యారు. పాకిస్థాన్ తన చివరి ఏడు వికెట్లను 20 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. ఓపెనర్లతో పాటు ఆయుబ్ (14) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే ఔట్ అయ్యారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4 వికెట్లు తీశాడు. బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు. భారత్.. 147 రన్స్ చేస్తే.. ఈ మ్యాచ్‌తో పాటు ఆసియాకప్ 2025 టైటిల్‌ కూడా గెలుచుకుంటుం