తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై తీవ్ర ఉత్కంఠత నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీల పదవీ కాలం పూర్తి అయ్యి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావొస్తుంది. కానీ ఇప్పటి వరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించలేదు. దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో.. మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలంటూ సెప్టెంబర్ చివరి వరకు గడువు ఇస్తూ.. గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసే సమయం దగ్గర పడినా.. స్థానిక ఎన్నికలపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. రాష్ట్రంలో ప్రధాన అడ్డంకిగా మారిన అంశం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు. సర్పంచ్ ఎన్నికల్లో దీన్ని అమలు చేయాలని రేవంత్ సర్కార్ పట్టుదలతో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా సీఎం రేవంత్ అమలు చేస్తామని తెలిపారు. ఆ వివరాలు.. బీసీలకు కల్పించే 42 శాతం కోటాను కలుపుకుని.. మొత్తం రిజర్వేషన్లు 69 శాతానికి పెరగనున్నాయి. ఈ అంశాన్ని స్వయంగా ప్రస్తావించారు. తమిళనాడులో జరిగిన మహావిద్య చైతన్య ఉత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం మీదక కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు తరహాలోనే తెలంగాణలో కూడా రిజర్వేషన్లు పెంచుతామని చెప్పుకొచ్చారు. . ఉంటాయి. ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. ఈ రెండు కలిపి మొత్తం 69 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అలానే తమిళనాడు రిజర్వేషన్ల విధానం అన్ని రాష్ట్రాలకు ఆదర్శమని ఆయన కొనియాడారు. తమిళనాడు విద్యా విధానం చాలా బాగుందని సీఎం రేవంత్ ప్రశంసించారు. తెలంగాణలో కూడా విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. అందుకే స్పోర్ట్స్ యూనివర్సిటీ, సమీకృత గురుకులాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారుఇదిలా ఉంటే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. దీనిలో భాగంగా గ్రామ పంచాయతీలు, మండలాల్లోని వార్డులు, సర్పంచ్‌, ఎంపీటీసీలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జీవో జారీ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాతే రిజర్వేషన్ల తుది జాబితాను పంచాయతీరాజ్‌ శాఖ విడుదల చేయనుంది. త్వరలోనే దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.