తిరుమల శ్రీవారి భక్తులకు దర్శనం మరింత త్వరగా.. దేశంలో తొలిసారిగా ICCC, వివరాలివే

Wait 5 sec.

తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) ప్రారంభమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఐసిసి సెంటర్‌ను ప్రారంభించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేలా అత్యుత్తమ విధానాన్ని అనుసరించాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. అంతకుముందు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం రెడీ అనలటిక్స్, మెషీన్ లెర్నింగ్ సాయంతో నిరీక్షణలో ఎంత మంది భక్తులు ఉన్నారో గుర్తించి అందుకు అనుగుణంగా క్యూలైన్ నిర్వహణ చేపడతామని సంబంధిత అధికారులు వివరించారు. అలాగే భక్తుల వేచి ఉండే క్యూ కాంప్లెక్సుల్లో భక్తి భావన పెంపోందించేలా ఆధ్యాత్మిక వీడియోలను, శ్రీవారి చరిత్రను ప్రదర్శించాలని ఆదేశించారు. 'కొండపైకి నిషేధిత వస్తువులు తీసుకురాకుండా అలిపిరి దగ్గరే నిలువరించేలా ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచే టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించాలి. కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించిన సీసీ కెమెరాల సాయంతో అలిపిరి నుంచే రద్దీ హీట్ మ్యాప్‌లను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. శ్రీవారి ఏడుకొండలు ఏడు రంగులతో గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకోవాలి. మానసిక ప్రశాంతత ఆలయాలలో మాత్రమే ఉంటుందని, ఆలయాల నిర్మాణాలకు, నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. టీటీడీ నిర్వహణలోని అన్ని దేవాలయాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానించాలి' అని సూచించారు. లో భక్తుల రద్దీని తగ్గించేందుకు ఈ సెంటర్‌లో AI, క్వాంటమ్ రెడీ అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలతో పనిచేస్తుంది. 6 వేల సీసీ కెమెరాల ద్వారా 3డీ మ్యాపింగ్ చేస్తుంది. అలాగే రెడ్ స్పాట్లను గుర్తిస్తుంది. రద్దీని కూడా నిర్వహిస్తుంది. ఈ సెంటర్ అలిపిరి నుండి తిరుమల వరకు భక్తుల రద్దీని గమనిస్తుంది. క్యూలైన్లను నియంత్రిస్తుంది. దీని ద్వారా భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏఐ సాంకేతికతను ఉపయోగించి భక్తుల రద్దీని అంచనా వేస్తారు. భక్తుల భద్రతను పర్యవేక్షిస్తారు.. క్యూలైన్లలోని పరిస్థితులు, దర్శనానికి పట్టే సమయం వంటి వివరాలను తెలుసుకొని, భక్తులకు మరింత మెరుగైన సేవలను అందిస్తారు.అలిపిరి నుంచే ప్రత్యేక కెమెరాలతో భక్తుల రద్దీని ఏఐ అంచనా వేస్తుంది. క్యూలైన్లలో ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంత సమయంగా వారు వేచి ఉన్నారు, సర్వదర్శనం పరిస్థితి వంటి విషయాలను ఏఐ ట్రాక్ చేస్తుంది. దీని ద్వారా అధికారులు రద్దీని ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటారు. పెద్ద డిజిటల్ స్క్రీన్‌పై సీసీ టీవీ ఫుటేజీలను 25 మందికి పైగా సాంకేతిక సిబ్బంది పర్యవేక్షిస్తారు. వారు ఎప్పటికప్పుడు పరిస్థితులను అధికారులకు తెలియజేస్తారు. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా భక్తులను గుర్తిస్తారు. దీని ద్వారా చోరీలు, ఇతర అవాంఛనీయ ఘటనలను వెంటనే గుర్తించవచ్చు. తప్పిపోయిన వారిని కూడా సులువుగా గుర్తించవచ్చు. భక్తుల ముఖ కదలికలను బట్టి వారి ఇబ్బందులను తెలుసుకుంటారు.క్యూలైన్లు, వసతి వంటి సౌకర్యాలను 3డీ మ్యాప్‌లు, చిత్రాలతో చూపిస్తారు. రద్దీగా ఉన్న ప్రాంతాలను రెడ్ స్పాట్లుగా చూపిస్తారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సూచనలు ఇస్తారు. ఆన్‌లైన్‌లో సైబర్ దాడులను, టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో పెట్టే అనుచిత పోస్టులను అడ్డుకుంటారు. ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారాన్ని కూడా నిరోధిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులను బయటకు తీసుకొచ్చే మార్గాలను కూడా ఈ వ్యవస్థ చూపిస్తుంది. ఈ టెక్నాలజీ భక్తులకు మరింత సులభంగా, సురక్షితంగా దర్శనం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది.