Cooperative Banks: దేశంలోని అన్ని బ్యాంకులు, , నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFC), ఇతర ఆర్థిక సంస్థలు అన్నింటికీ నియంత్రణ సంస్థ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే వీటి కార్యకలాపాల్ని కేంద్ర బ్యాంకే నిశితంగా పరిశీలిస్తుంటుంది. వీటి కోసం ప్రత్యేక నియమ నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందిస్తుంటుంది. ఇక అవి కచ్చితంగా వీటిని పాటించాల్సి ఉంటుంది. లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే.. అన్ని ఆర్థిక సంస్థల కార్యకపాలాల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. ఊరుకోదు. చర్యలు తీసుకుంటుంటుంది. దీనిపై ప్రకటనలు కూడా విడుదల చేస్తుంటుంది. ఎక్కువగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, సహకార బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు.. ఆంక్షలకు గురవుతుంటాయి. ఇ. ఇందులో ఆ మధ్య కోటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు చాలా కాలం పాటు ఆర్బీఐ నిర్ణయంతో ప్రభావితమయ్యాయి. సమస్య ఒకవేళ తీవ్రంగా ఉన్నట్లయితే.. కొన్నిసార్లు లైసెన్స్ రద్దు చేసేందుకు కూడా వెనుకాడదు ఆర్బీఐ. కొన్ని సార్లు.. కఠిన ఆంక్షలు విధిస్తుంటుంది. ఇప్పుడు ఇలాగే నియంత్రణాపర ఉల్లంఘనల నేపథ్యంలో.. ఆర్బీఐ ఒకేసారి 5 కో ఆపరేటివ్ బ్యాంకులపైనా చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి ఒక సర్క్యులర్ విడుదల చేసింది. వీటిపై పెద్ద మొత్తంలో జరిమానాలు విధించింది. వీటి గురించి చూద్దాం. >> ముందుగా తమిళనాడు సర్కిల్ పోస్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై రూ. 50 వేల ఫైన్ పడింది. ఇది ఆర్బీఐ నిర్దేశించిన సూపర్‌వైజరీ యాక్షన్ ఫ్రేమ్‌వర్క్ (SAF) ఆదేశాల్ని పాటించలేదు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ది గుంటూర్ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్‌పైనా అంతే మొత్తం జరిమానా పడింది. ఇక్కడ కేవైసీ నిబంధనల్ని పాటించలేదని కారణంగా తెలిపింది. కర్ణాటకలోని సౌత్ కెనరా డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై రూ. 1.50 లక్షల జరిమానా విధించింది ఆర్బీఐ. హౌసింగ్ ఫైనాన్స్ రెగ్యులేషన్స్‌కు సంబంధించి ఇక్కడ నియంత్రణాపర నిబంధనల్ని ఉల్లంఘించింది. ఇక్కడ పరిమితికి మించి హౌసింగ్ లోన్స్ ఇష్యూ చేసింది. తెలంగాణ జగిత్యాల ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న.. గాయత్రీ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ రూ. 10 లక్షల జరిమానా ఎదుర్కొంది. ఇక్కడ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్‌కు సంబంధించి మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్‌లో నిబంధనలు ఉల్లంఘించినట్లు పేర్కొంది. ఇంకా గుజరాత్ వడోదరా ప్రధాన కేంద్రంగా ఉన్న.. మకార్‌పురా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పైనా రూ. 2 లక్షల ఫైన్ విధించింది. ఇక్కడ ఆర్బీఐ నిర్దేశించిన కేవైసీ మార్గదర్శకాలు, సైబర్ సెక్యూరిటీ నిబంధనల్ని పాటించలేదు.