హైదరాబాద్ ORR-RRR మధ్య గ్రీన్‌ఫీల్డ్ రహదారి.. 14 గ్రామాలకు మహర్దశ

Wait 5 sec.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌), రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) మధ్య అనుసంధానాన్ని కల్పించనున్న పనులు ప్రారంభం కానున్నాయి. నుంచి ఆమన్‌గల్ వరకు నిర్మించ తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక రహదారి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరు మండలాల్లోని 14 గ్రామాల మీదుగా రెండు దశల్లో ఈ రోడ్డును నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం పొడవు 41.50 కిలోమీటర్లు కాగా.. ఇందుకోసం మొత్తం రూ. 4,621 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా హెచ్‌ఎండీఏ ఇప్పటికే టెండర్లను ఖరారు చేసింది. ఈ రహదారి నిర్మాణాన్ని 30 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణంతో అర్బన్, గ్రామీణ ప్రాంతాల మధ్య అనుసంధానం గణనీయంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా 'ఫ్యూచర్ సిటీ'కి ఒక ప్రత్యేక కారిడార్‌గా ఉపయోగపడుతుంది. తద్వారా ఆ ప్రాంతంలో ఐటీ పార్కులు, పరిశోధన కేంద్రాలు, ఆధునిక నివాస సముదాయాల ఏర్పాటుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ రోడ్డు ఈ-సిటీకి అనుసంధానం కావడంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 'మేక్ ఇన్ తెలంగాణ' కార్యక్రమానికి కూడా తోడ్పాటునందించనుంది.రహదారిని 100 మీటర్ల రైట్ ఆఫ్‌ వేతో కంట్రోల్ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దీన్ని 3+3 లేన్ల మెయిన్ క్యారేజ్‌వేగా రూపొందిస్తున్నారు, భవిష్యత్తులో దీన్ని 4+4 లేన్ల వరకు విస్తరించే అవకాశం ఉంది. రహదారి మొత్తం పొడవులో.. 8.94 కిలోమీటర్ల మేర మార్గం 7 రిజర్వు ఫారెస్ట్ బ్లాకులలో (సుమారు 236.89 ఎకరాలు) వెళ్తుంది. వీటికి సంబంధించిన అనుమతుల కోసం హెచ్‌ఎండీఏ ఇప్పటికే దరఖాస్తు చేసింది. అదనంగా 7.69 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం కోసం టీజీఐఐసీ కి చెందిన 310 ఎకరాలు అవసరం కానుంది.రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రహదారిని రెండు ప్రధాన దశల్లో నిర్మించనున్నారు. తొలి దశ 19.20 కి.మీ రావిర్యాల్ ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ఛేంజ్ నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు నిర్మిస్తారు. భూసేకరణతో కలిపి రూ. 1,911 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ రహదారిని కొంగరకుర్దు, ఫిరోజ్‌గూడ, కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్‌ఖాన్‌పేట్ గ్రామాల మీదుగా ఈ మార్గం వెళ్తుంది.రెండో దశలో 22.30 కి.మీ మేర మీర్‌ఖాన్‌పేట నుంచి ఆమన్‌గల్ వరకు నిర్మిస్తారు. ప్రాజెక్టు వ్యయం భూసేకరణతో కలిపి రూ. 2,710 కోట్లు. ఈ రహదారిని కుర్మిద్ద, కడ్తాల్, ముద్విన్, ఆకుతోటపల్లి, ఆమన్‌గల్ గ్రామాల మీదుగా నిర్మిస్తారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఆయా గ్రామాలకు మహర్దశ పట్టనుంది.