Speed Post Tariffs Hike: భారతదేశంలో పోస్టల్ సేవల్ని మరింత బలోపేతం చేసేందుకు.. ఇంకా ప్రజల్లో విశ్వసనీయతను పెంపొందించేందుకు కీలక మార్పులు చేసింది. స్పీడ్ పోస్ట్ టారిఫ్స్ సవరించింది. 2025, అక్టోబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. పెరుగుతున్న నిర్వహణ వ్యయాల్ని తట్టుకునేందుకు కొత్త ఆవిష్కరణల్లో పెట్టుబడి పెట్టేందుకు.. 2012 తర్వాత టారిఫ్స్ సవరించారు. రిజిస్టర్డ్ పోస్ట్ సేవల్ని .. 2025 సెప్టెంబర్ 1 నుంచే.. దేశీయ ట్రాన్స్‌మిషన్ కోసం స్పీడ్ పోస్టుల్లో విలీనం చేశారు.>> స్పీడ్ పోస్ట్ టారిఫ్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 50 గ్రాముల వరకు అయితే.. లోకల్‌లో ఛార్జీ రూ. 15 నుంచి రూ. 19 కి పెరిగింది. ఇది 200 కిలోమీటర్ల లోపు చూస్తే రూ. 47 గా ఉంది. అంతకుముందు రూ .35 గా ఉంది. ఆపైన ఎన్ని కిలోమీటర్లు అయినా ఛార్జీ రూ .47 గానే చేసింది. ఇక 51- 250 గ్రాముల వరకు చూస్తే.. లోకల్ ఛార్జీ అంతకుముందు రూ. 25 కాగా.. ఇప్పుడు రూ. 24 గా ఉంది. 200 కిలోమీటర్ల వరకు చూస్తే అంతకుముందు రూ. 35 గా ఉండగా.. ఇప్పుడు రూ. 59 గా ఉంది. 201-1000 కిలోమీటర్లపై అంతకుముందు రూ. 40.. ఇప్పుడు 201-500 కిలోమీటర్ల వరకు రూ. 63 ; 501-1000 కిలోమీటర్ల వరకు రూ. 68 పడుతుంది. 1001-2000 కి.మీ. వరకు చూస్తే అంతకుముందు రూ. 60 ఇప్పుడు రూ. 72పడుతుంది. 2 వేల కిలోమీటర్లపైన అంతకుముందు రూ. 70 గా ఉండగా.. ఇప్పుడు రూ. 77 అయింది. 251 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు కూడా ఈ రేట్లు పెరిగాయి.స్పీడ్ పోస్ట్ కొత్త ఫీచర్లు..ఓటీపీ బేస్డ్ సేఫ్ డెలివరీ- ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ నిర్ధరణ తర్వాత మాత్రమే.. వస్తువును డెలివరీ చేస్తారు. రియల్ టైమ్ డెలివరీ అప్డేట్స్- దీని ద్వారా పోస్ట్ ఎక్కడుందో ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది.ఆన్‌లైన్ బుకింగ్ అండ్ పేమెంట్స్- సౌకర్యవంతమైన ఆన్‌లైన్ బుకింగ్ సహా ఆన్‌లైన్ పేమెంట్స్ చేసే వీలుంటుంది.ఇంకా వినియోగదారుల కోసం రిజిస్ట్రేషన్ సదుపాయం కూడా ఉంది. మరోవైపు కొత్త వాల్యూ యాడెడ్ సర్వీసుల్ని కూడా ప్రకటించింది. ఇక్కడ సేఫ్ డెలివరీ కోసం ఈ సేవకు ఒక్కో స్పీడ్ పోస్ట్ వస్తువుపైన రూ. 5 సహా అదనంగా జీఎస్టీ చెల్లించాలి. ఓటీపీ డెలివరీ ఛార్జీ కూడా రూ. 5 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. మరోవైపు విద్యార్థులకు స్పీడ్ పోస్ట్ టారిఫ్స్‌పై 10 శాతం డిస్కౌంట్ అమలుచేస్తుంది. కొత్త బల్క్ కస్టమర్లకు కూడా 5 శాతం డిస్కౌంట్ ఉంది.