దసరా పండుగ వేళ రేవంత్ సర్కార్ సామాన్య ప్రజలతో పాటుగా.. ప్రభుత్వ సిబ్బందికి కూడా శుభవార్త చెబుతోంది. పలు విభాగాలకు చెందిన ఉద్యోగులకు బకాయిలు విడుదల చేయడమే కాక.. . ఇక తాజాగా మరో శాఖ సిబ్బందికి శుభవార్త చెప్పేందుకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఒక్కో ఉద్యోగికి రూ.30 లక్షల నుంచి రూ.1.25 కోటి వరకు లబ్ధి చేకూరనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు.. దసరా పండుగ వేళ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఉద్యోగులకు పండగలాంటి వార్తే అని చెప్పవచ్చు. ఇంతకు ఈ నిర్ణయం దేనికి సంబంధించినది అంటే.. కార్మికులకు రూ.30 లక్షలు, పర్మినెంట్ ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.1.25 కోట్ల కల్పిస్తూ జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సిబ్బంది రూపాయి ఖర్చు చేసే పని లేదు. ఇటీవల గణేష్ నిమజ్జన వేడుకల్లో భాగంగా ఓ వాహనం ఢీకొని పారిశుద్ధ్య కార్మికురాలు రేణుక చనిపోయిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. నిత్యం చెత్తలో తిరుగుతుండటం వల్ల అనారోగ్యం పాలై చనిపోవడం.. రోడ్డు ప్రమాదాల్లో మరణించడం వంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీతో) ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుతం . దీన్ని ఆదర్శంగా తీసుకుని జీహెచ్ఎంసీ కూడా ఇదే బాటలో పయనించేందుకు రెడీ అవుతోంది. సింగరేణి తన కార్మికుల కోసం అమలు చేస్తోన్న బీమా విధానం గురించి పీఎన్‌బీతో చర్చించారు. అదే విధానాన్ని జీహెచ్ఎంసీ కార్మికులకు కూడా వర్తింపచేయాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా జీహెచ్ఎంసీలో రూ.25 వేల వరకు వేతనం పొందుతున్న వారికి రూ.30 లక్షలు ప్రమాద బీమా సౌకర్యం కల్పించనున్నారు. అలానే రూ.25 వేల నుంచి 75 వేల రూపాయల మధ్య వేతనం ఉన్న వారికి రూ.50 లక్షల ప్రమాద బీమా.. రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు జీతం ఉన్న వారికి రూ.కోటి రూపాయల ప్రమాద బీమా కల్పించనున్నారు. అలానే నెలకు రూ.1.50 లక్షలకు పైన వేతనం తీసుకునే వారికి రూ. 1.25 కోట్ల ప్రమాద బీమా వర్తింపచేసేలా పీఎన్‌బీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అలానే విమాన ప్రమాదంలో మరణించే కార్మికులకు రెట్టింపు బీమా లభిస్తుంది. శాశ్వత అంగ వైకల్యం పొందితే సగం బీమా సౌకర్యం అందుతుందని అధికారులు తెలిపారు.