ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే బాలికలకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. ప్రభుత్వ విద్యా సంస్థల నుంచి వచ్చిన విద్యార్థినులకు ఈ ఫౌండేషన్ ఏటా రూ. 30 వేల స్కాలర్‌షిప్ అందిస్తోంది. అజీమ్ ప్రేమ్‌జీ తెలంగాణ ఏరియా ఇంఛార్జ్ ఎం. శ్రీనివాస్‌రావు, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఈ స్కాలర్ షిప్ వివరాలను ఇటీవల వెల్లడించారు. డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ వంటి గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివే విద్యార్థినులకు ఉపకార వేతనం అందిస్తారు. కోర్సులో చేరిన మెుదటి ఏడాది నుంచి కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి ఏడాది రూ. 30,000 వేల స్కాలర్ షిప్ అందించనున్నారు. అయితే ఆయా విద్యార్థినులు తప్పనిసరిగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివి ఉండాలి.ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 2.5 లక్షల మంది బాలికలకు తమ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నట్టు శ్రీనివాసరావు తెలిపారు. మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో లక్షల్లో దరఖాస్తులు వస్తుండగా.. తెలంగాణలో కేవలం 3,275 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాలికల్లో ఈ పథకం పట్ల సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేల మంది విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌లు అందించాలని ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. అర్హులైన వారిని లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. అర్హత ఉన్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్ కోసం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. దరఖాస్తుకు అవసరమైన పత్రాలు:తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకంబ్యాంకు ఖాతా వివరాలు10వ తరగతి, ఇంటర్ మార్కుల మెమోలుఆధార్ కార్డుగ్రాడ్యుయేషన్ అడ్మిషన్ రుసుము రసీదు (బోనఫైడ్ లేదా ట్యూషన్ ఫీజు రసీదు).దరఖాస్తుకు ఎలాంటి ఫీజు ఉండదు.ప్రస్తుత విడతలో దరఖాస్తులు పంపడానికి సెప్టెంబర్ 30 చివరి గడువు.రెండో విడత దరఖాస్తుల ప్రక్రియను వచ్చే ఏడాది జనవరిలో తిరిగి ప్రారంభిస్తారు.పూర్తి వివరాలు, సందేహాల కోసం ఫౌండేషన్ అందించిన 99630 28900 నంబర్‌లో సంప్రదించవచ్చు. ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే బాలికలు ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు.