గుడ్‌న్యూస్.. ఒక్కో రైతు అకౌంట్లోకి రూ. 2 వేలు.. వారికి కాస్త ముందే పడ్డాయ్

Wait 5 sec.

: కేంద్ర ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. రైతులకు పంట సాయం కింద ఏటా రూ. 6 వేలను పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని ఏటా 3 విడతలుగా 4 నెలలకు ఓసారి రూ. 2 వేల చొప్పున నేరుగా రైతుల అకౌంట్లలోనే వేస్తుంటారు. ఇటీవల .. ప్రధాని మోదీ విడుదల చేశారు. ఇక్కడ మొత్తం 9 కోట్ల 59 లక్షల 28 వేల 628 మంది రైతుల అకౌంట్లలోరూ. 2 వేల చొప్పున జమ చేశారు. ఈ క్రమంలోనే.. ఇప్పుడు 21వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక్కడే ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇంకా సమయం ఉన్నప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో 21వ విడత నిధుల్ని విడుదల చేసింది కేంద్రం. ఇందులో పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. ఇటీవల ఇక్కడ భారీ వర్షాల ధాటికి వరదలు బీభత్సం సృష్టించాయి. కొన్ని చోట్ల కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. దీంతో ఆయా రాష్ట్రాలు భారీగా నష్టపోయాయి. రైతుల పంట పొలాలు కూడా నాశనం అయ్యాయి. దీంతో తీరని నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే వారికి అండగా ఉండేందుకు.. 21వ విడత నిధుల్ని కాస్త ముందుగానే విడుదల చేశారు. మొత్తం 27 లక్షల మంది రైతుల అకౌంట్లలోకి రూ. 540 కోట్లు జమ చేశారు. ఇందులో 2.7 లక్షల మంది వరకు మహిళా రైతులు కూడా ఉన్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ నిధుల్ని విడుదల చేశారు. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో.. ఆయా రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. వరదల ధాటికి నష్టపోయిన రైతులకు కొంత వరకైనా ఈ ముందస్తు సాయం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లో 8,01,045 మంది రైతులకు రూ. 160.21 కోట్లు విడుదల చేశారు. పంజాబ్ విషయానికి వస్తే.. 11,09,895 మంది లబ్ధిదారులకు రూ. 221.98 కోట్లు వచ్చాయి. ఉత్తరాఖండ్‌లో 7,89,128 మంది రైతుల అకౌంట్లలో రూ. 157.83 కోట్లు జమయ్యాయి. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి లబ్ధిదారుల స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఆధార్ నంబర్ లేదా అకౌంట్ నంబర్ ఎంటర్ చేసి గెట్ డేటాపై క్లిక్ చేస్తే వివరాలు కనిపిస్తాయి. ఇంకా.. పీఎం కిసాన్ నిధులు పొందాలంటే.. కేవైసీ కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది.