అర్ష్‌దీప్ రీల్స్ వైరల్.. జస్టిస్ ఫర్ శాంసన్ డైలాగ్ హైలెట్, గంభీర్‌ను కూడా నవ్వించాడుగా!

Wait 5 sec.

ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత మైదానంలో ఓ రేంజ్‌లో సంబరాలు జరిగాయి. ముఖ్యంగా చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ చివరి బంతి పడకముందే తాను ఎలాంటి రీల్స్ చేయాలో ముందే ప్లాన్ చేసుకున్నానని కూడా అర్ష్‌దీప్ చెప్పడం ఆసక్తికరంగా మారింది భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత మ్యాచ్ అనంతరం జరిగిన ఇంటర్వ్యూలో హర్షా భోగ్లేతో మాట్లాడిన అర్ష్‌దీప్ ఈ విషయాన్ని వెల్లడించాడు.“నేను పది లేదా పదిహేను రీల్స్ గురించి ముందే ఆలోచించాను. వాటిలో ఎంతవరకు చేస్తామో చూద్దాం” అని అర్ష్‌దీప్ నవ్వుతూ చెప్పాడు. అయితే ట్రోఫీ ప్రదాన కార్యక్రమం ముగిసిన కొద్దిసేపటికే అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రీల్స్ నిజంగానే అభిమానులను ఆకట్టుకున్నాయి.అందులో మొదటి రీల్ సంజూ శాంసన్‌తో కలిసి చేసింది. ఆ వీడియోలో అర్ష్‌దీప్ “పాజీ, జస్టిస్ మిల్ గయా” అని చెప్పాడు. ఇది సోషల్ మీడియాలో చాలా కాలంగా వినిపిస్తున్న చర్చకు ఒక రకమైన స్పందనగా మారింది. చాలా సంవత్సరాలుగా జట్టులో స్థానం కోసం పోరాడుతూ వచ్చాడు. ఎప్పుడో జట్టులోకి వచ్చి, మళ్లీ బయటకు వెళ్లిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఈసారి కూడా టీ20 వరల్డ్ కప్ ప్రారంభంలో అతను బెంచ్‌పైనే ఉండాల్సి వచ్చింది.కానీ భారత్ టాప్ ఆర్డర్‌లో ఎక్కువగా ఎడమచేతి బ్యాట్స్‌మెన్ ఉండటంతో జట్టు కాంబినేషన్ మార్చాలని నిర్ణయించుకుంది. ఆ సమయంలో శాంసన్‌కు అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని అతను అద్భుతంగా వినియోగించుకున్నాడు. ఫైనల్లో న్యూజిలాండ్‌పై 46 బంతుల్లో 89 పరుగులు చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. ఈ టోర్నమెంట్‌లో ఇది అతని వరుసగా మూడో 80కి పైగా స్కోర్ కావడం విశేషం. అర్ష్‌దీప్ చేసిన మరో వైరల్ రీల్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో ఉంది. సాధారణంగా చాలా సీరియస్‌గా కనిపించే గంభీర్ ఆ వీడియోలో మాత్రం అరుదుగా నవ్వుతూ కనిపించాడు. అర్ష్‌దీప్ చేసిన సరదా రీల్‌లో గంభీర్ కూడా భాగమవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. మరో రీల్‌లో ఇషాన్ కిషన్ కూడా కనిపించాడు. ఈ టోర్నమెంట్‌లో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల్లో 317 పరుగులు చేసి టీమిండియా విజయానికి తోడ్పడ్డాడు. ఆ రీల్‌లో అర్ష్‌దీప్, ఇషాన్ ఇద్దరూ కలిసి “పాజీ, ఏక్ బిహారి.. సబ్ పే భారీ” అని ఒక వైరల్ బిహారీ పాటలోని లైన్‌ను సరదాగా చెప్పారు. 2024 టీ20 వరల్డ్ కప్‌లో అర్ష్‌దీప్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ ఎడిషన్‌లో కూడా ఎనిమిది మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీసి జట్టుకు కీలకంగా మారాడు. టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలవడం మాత్రమే కాదు, టైటిల్‌ను డిఫెండ్ చేసిన తొలి జట్టుగా కూడా చరిత్ర సృష్టించింది. ఈ విజయ సంబరాల్లో అర్ష్‌దీప్ చేసిన సరదా రీల్స్ అభిమానులకు మరింత ఆకట్టుకున్నాయి.