వరుసగా రెండుసార్లు సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక మాస్టర్ ప్లాన్ ఎంతో ఉంది. దాంతో టీమిండియా సెలబ్రేషన్స్ తర్వాత భారత జట్టు మాజీ కెప్టెన్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను ఉద్దేశిస్తూ చేసిన ఓ మెసెజ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తుల్లో గౌతమ్ గంభీర్ ఒకరు. కానీ ఆన్‌లైన్ చర్చలు ఎలా ఉన్నా, జట్టు ఫలితాలు మాత్రం వేరే కథ చెబుతున్నాయి. 2024 జూలైలో భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గంభీర్ జట్టును విజయపథంలో నడిపించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి అతను నిర్మించిన జట్టు టీ20ల్లో వరుస విజయాలను అందుకుంటూ వచ్చింది. వారి భాగస్వామ్యం చివరకు మార్చి 8న టీ20 వరల్డ్ కప్ టైటిల్‌తో అత్యున్నత స్థాయికి చేరింది.ఈ ఫైనల్ మ్యాచ్ ప్రత్యేకత ఏంటంటే, భారత్ తమ స్వదేశంలోనే ట్రోఫీని గెలుచుకోవడం. మ్యాచ్ ప్రారంభానికి ముందు మాజీ టీ20 వరల్డ్ కప్ విజేత కెప్టెన్లు ఎంఎస్ ధోనీ (2007), రోహిత్ శర్మ (2024) ట్రోఫీని మైదానంలోకి తీసుకొచ్చారు. చివరి వికెట్ పడిన వెంటనే భారత్ విజయం ఖరారవడంతో స్టేడియం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది.విజయం అనంతరం ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో టీమిండియాకు ప్రత్యేక అభినందనలు తెలిపాడు. ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్‌ను ఉద్దేశిస్తూ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. “అహ్మదాబాద్‌లో చరిత్ర సృష్టించారు. టీమ్‌కు, సపోర్ట్ స్టాఫ్‌కు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులకు పెద్ద అభినందనలు. మీరు అందరూ ఆడిన తీరు చూడటం చాలా ఆనందంగా ఉంది. కోచ్ సాబ్.. మీ నవ్వు మీకు చాలా బాగుంటుంది. నవ్వుతో ఉన్న ఇంటెన్సిటీ నిజంగా కిల్లర్ కాంబో. అద్భుతమైన పని చేశారు. అందరూ ఈ విజయాన్ని ఎంజాయ్ చేయండి. బుమ్రా గురించి ఏమీ రాయకపోవడమే మంచిది, అతను నిజమైన ఛాంపియన్ బౌలర్” అని ధోనీ రాసుకొచ్చాడు.ధోనీ, గంభీర్ మధ్య సంబంధం గురించి గతంలో ఎన్నో చర్చలు జరిగాయి. ముఖ్యంగా 2011 వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా ధోనీ కొట్టిన ఆ సిక్సర్ గురించి గంభీర్ చేసిన వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో ఈ అంశం పెద్ద చర్చగా మారింది. అయితే ధోనీ మాత్రం ఎప్పుడూ గంభీర్‌పై బహిరంగంగా విమర్శలు చేయలేదు.ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత్ పూర్తిగా మ్యాచ్‌ను ఆధిపత్యంలో ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ అర్ధశతకాలు సాధించి జట్టుకు బలమైన స్కోర్ అందించారు.తర్వాత బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా తన క్లాస్‌ను చూపించాడు. అతను నాలుగు వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాటింగ్‌ను కూల్చేశాడు. అక్షర్ పటేల్ కూడా మూడు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. చివరికి న్యూజిలాండ్ జట్టు 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ ప్రదర్శనకు బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా ఆడిన సంజూ శాంసన్ ఐదు మ్యాచ్‌లలో 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును దక్కించుకున్నాడు.