కు ముందు తమ జట్టు అభిమానులకు ప్రత్యేక సందేశం పంపించాడు. భారత్‌తో జరగనున్న కీలక పోరుకు ముందు తమకు మద్దతుగా నిలవాలని కోరాడు. ఈ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరొందిన ఈ వేదికలో భారత్-న్యూజిలాండ్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కూడా చరిత్ర సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. న్యూజిలాండ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలవలేదు. అందుకే ఈసారి తొలి ట్రోఫీని గెలుచుకోవాలని కివీస్ ఆశిస్తోంది. మరోవైపు టీమిండియా మాత్రం మరో ప్రత్యేక రికార్డు కోసం బరిలోకి దిగుతోంది. భారత్ ఈ ఫైనల్ గెలిస్తే టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను వరుసగా రెండోసారి కాపాడుకున్న తొలి జట్టుగా నిలుస్తుంది. అంతేకాకుండా మొత్తం మూడు టీ20 వరల్డ్ కప్ ట్రోఫీలు గెలిచిన మొదటి జట్టుగా కూడా చరిత్ర సృష్టిస్తుంది.ఈ కీలక మ్యాచ్‌కు ముందు శాంట్నర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు సందేశం ఇచ్చాడు. “బ్లాక్ క్యాప్స్ కెప్టెన్ మిచ్ శాంట్నర్ మాట్లాడుతున్నాను. ఆదివారం మీకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి. నేను పెద్దగా ప్రసంగాలు చేసే వ్యక్తిని కాదు. కానీ అహ్మదాబాద్‌లో భారత్‌తో జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ గురించి మీకు గుర్తు చేయాలని అనిపించింది” అని తన సందేశాన్ని ప్రారంభించాడు.అహ్మదాబాద్‌లో భారత్ అభిమానుల సంఖ్య ఎంతో ఎక్కువగా ఉండబోతోందని కూడా ఆయన చెప్పాడు. “ఇక్కడ పరిస్థితి చూస్తే మేము కొంచెం సంఖ్యలో తక్కువగానే ఉన్నాం. భారత్‌లో 140 కోట్ల మంది అభిమానులు ఉన్నారు. నరేంద్ర మోదీ స్టేడియంలోని 1.30 లక్షల సీట్లలో ఎక్కువ మంది భారత్‌కే మద్దతు ఇస్తారు. అయినా అది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే స్వదేశంలో మీరు అందరూ మా వెంటే ఉన్నారని మాకు తెలుసు” అని శాంట్నర్ పేర్కొన్నాడు.అభిమానులు తమకు మద్దతుగా సోషల్ మీడియాలో పంపుతున్న సందేశాలను కూడా జట్టు గమనిస్తోందని ఆయన తెలిపాడు. “మీరు స్టేడియంలో లేకపోయినా మీ ఫోటోలు, పోస్టులు, కథలు మేము చూస్తున్నాం. మీరు రాత్రిళ్లు మేల్కొని మా మ్యాచ్‌లు చూస్తున్నారని మాకు తెలుసు. మీ ప్రేమ, మద్దతు మాకు చాలా విలువైనది” అని శాంట్నర్ అన్నాడు.మ్యాచ్ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అభిమానులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి కూడా చేశాడు. భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ భారత్‌లో సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే న్యూజిలాండ్ సమయానికి అది తెల్లవారుజామున 2:30 గంటలు అవుతుంది. “మాకు తెలుసు ఫైనల్ మ్యాచ్ మీ సమయానికి చాలా తెల్లవారుజామున జరుగుతుంది. అయినా దయచేసి అలారం పెట్టుకుని మరోసారి మాకు మద్దతు ఇవ్వండి. మీరు పనికి లేదా స్కూల్‌కు కొంచెం ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చినా మీ బాస్ లేదా టీచర్లకు నా సందేశం చెప్పండి” అని శాంట్నర్ సరదాగా వ్యాఖ్యానించాడు.చివరగా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక ఆశ కూడా వ్యక్తం చేశాడు. “ధన్యవాదాలు.. మేము త్వరలో ఇంటికి తిరిగి వస్తాం. ఆశిస్తున్నాను ట్రోఫీతో పాటు మరికొంత అదనపు సామానుతో వస్తామని” అని సాంట్నర్ తన సందేశాన్ని ముగించాడు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.