దశలో అత్యంత కీలకంగా మారిన . అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ పోరులో సౌతాఫ్రికా - వెస్టిండీస్ రెండు జట్లు సెమీఫైనల్ స్థానం కోసం తలపడనున్నాయి. ఈ మ్యాచ్ విజేత టాప్ ప్లేస్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.సూపర్‌-8లో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిన భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఓటమితో టీమిండియా నెట్‌రన్‌రేట్ –3.800కి పడిపోయింది. ఒకవేళ ఈ సూపర్ 8లో మూడు జట్లు ఆరు పాయింట్లతో సమానంగా నిలిస్తే, నెట్‌రన్‌రేట్ ఆధారంగానే సెమీఫైనల్ బెర్త్ నిర్ణయమవుతుంది. ఇదే తరహా పరిస్థితి 2012 టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఎదురైంది. అప్పట్లో భారత్ రెండు మ్యాచ్‌లు గెలిచినా, తక్కువ నెట్‌రన్‌రేట్ కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అదే పరిస్థితి మళ్లీ పునరావృతమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా సెమీస్ బరిలో నిలవాలంటే.. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో విండీస్ ఓడిపోవాలి. వెస్టిండీస్ ఓడిపోతే సౌతాఫ్రికా దాదాపు సెమీఫైనల్‌కు వెళ్లినట్టే. వెస్టిండీస్ ఓడిపోవడంతో పాటు రాత్రి 7 గంటలకు జరిగే మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్ ఘన విజయం సాధిస్తే పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది. మార్చి 1న జరిగే భారత్-వెస్టిండీస్ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే అది సెమీస్‌లో అడుగుపెడుతుంది. దాంతో ఈ రోజు జరిగే వెస్టిండీస్ - సౌతాఫ్రికా మ్యాచ్‌ని టీమిండియా వేయి కళ్లతో చూడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో సౌతాఫ్రికాకు మంచి రికార్డే ఉంది. ఈ టీ20 వరల్డ్‌కప్‌లో సఫారీ జట్టు దాదాపు అన్ని మ్యాచ్‌లు ఇదే వేదికపై ఆడింది. ఆడిన అన్ని మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. భారత్‌ను కూడా ఇక్కడే చిత్తుచిత్తుగా ఓడించింది. దాంతో వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌కి ముందు సౌతాఫ్రికాకు ఇదో పెద్ద ప్లస్‌గా మారింది. మరోవైపు వెస్టిండీస్ ఈ టోర్నీలో పూర్తిగా కొత్త రూపంలో కనిపిస్తోంది. 2016లో భారత్‌లో టైటిల్ గెలిచిన తర్వాత 2021, 2022, 2024 టోర్నీల్లో నిరాశపరిచిన కరేబియన్ జట్టు, ఈసారి మాత్రం అదిరిపోయే ప్రదర్శన చేస్తోంది. వరుసగా ఐదు విజయాలతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది. ఇటీవల జింబాబ్వేపై చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసి సంచలనం సృష్టించింది. టీ20ల్లో సౌతాఫ్రికాపై వెస్టిండీస్‌కు స్వల్ప ఆధిక్యం ఉంది. మొత్తం 29 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ 15, సౌతాఫ్రికా 14 గెలిచాయి. అయితే వరల్డ్‌కప్ మ్యాచ్‌లో మాత్రం సౌతాఫ్రికా పైచేయి సాధించింది. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు ప్రొటీస్ గెలిచింది. ప్రస్తుత ఫామ్‌ను చూస్తే ఈ మ్యాచ్ కూడా అత్యంత ఉత్కంఠభరితంగా సాగనుందని అంచనా.వెస్టిండీస్ జట్టు అంచనాబ్రాండన్ కింగ్, షై హోప్, షిమ్రోన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, రూధర్‌ఫోర్డ్, రొమారియో షెఫర్డ్, జేసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకీలా హోసెన్, గుడకేశ్ మోటీ, షమార్ జోసఫ్. సౌతాఫ్రికా జట్టు అంచనాఎయిడెన్ మార్కరమ్, క్వింటన్ డికాక్, ర్యాన్ రికెల్టన్, డివాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో యాన్సన్, కార్బిన్ బాష్, కగిసో రబడా, లుంగి ఎంగిడి.