కాపు కమ్యూనిటీ వారసత్వాన్ని క్రైస్తవ మతంలోకి మార్చారు.. పూనమ్ కౌర్ చెప్పిన ఆ కన్వర్షన్ అంబాసిడర్ ఎవరబ్బా?

Wait 5 sec.

నటి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలతో కంటే వివాదాలతోనే ఆమె ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. అందరూ ఆమెను మర్చిపోయారు అనుకునే టైంలో ఏదొక ట్వీట్ పెట్టి వార్తల్లో నిలుస్తుంటారు. అప్పుడప్పుడు ఆమె పోస్టులు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా పూనమ్ తన ఎక్స్ అకౌంట్ లో అలాంటి ట్వీట్ ఒకటి పెట్టారు.పూనమ్ కౌర్ పరోక్షంగా ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తున్నట్లుగా పోస్టులు పెడుతుంటారనే సంగతి తెలిసిందే. పేర్లు చెప్పకుండా ఎవరికో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లుగా, చెప్పీ చెప్పినట్టుగా అర్ధమయ్యి అవ్వనట్లుగా ఆమె ట్వీట్లు చేయడం ఆమె ప్రత్యేకత. ఒక్కోసారి అసలు ఆమె చెప్పాలని అనుకుంటోంది?.. ఈ పోస్టుల వెనుక అంతర్యం ఏంటి? అని నెటిజన్లు తెగ చర్చించుకుంటుంటారు. పూనమ్ కూడా అదే కోరుకుంటుందో ఏమో తెలియదు కానీ.. ఇప్పటికీ డైరెక్ట్‌గా వారి పేర్లు బయట పెట్టకుండా ట్వీట్లు చేస్తుంటారు.“కొంతమంది హిందూ మతాన్ని కేవలం దుస్తులలో మాత్రమే అనుసరిస్తారు. ఆ లబ్ధిదారులు తమ పిల్లలకు 3 నెలల వయస్సు ఉన్నప్పుడే కాథలిక్ చర్చిలో బాప్టిజం ఇప్పించారు. మేమెప్పుడూ మా వారసత్వాన్ని మార్చుకోలేదు. కాపు కమ్యూనిటీ యొక్క గొప్ప పాత వారసత్వం ఆర్థడాక్స్ కాథలిక్ క్రైస్తవ మతంగా మార్పించడంలో మత మార్పిడి రాయబారిగా వ్యవహరిస్తున్నారు” అని పూనమ్ కౌర్ ఓ ట్వీట్ చేసింది. ఎప్పటిలాగే ఇందులో ఎవరి పేర్లూ ప్రస్తావించలేదు. కానీ ఎవరినో ఉద్దేశించి ఈ పోస్టు పెట్టినట్లు అర్థమవుతోంది. * హిందూ మతాన్ని వేసుకునే దుస్తుల్లోనే అనుసరిస్తూ తన వారసులకు బాప్టిజం చేయించిన ఆ వ్యక్తి ఎవరు? పూనమ్ కౌర్ చెప్పిన ఆ కన్వర్షన్ అంబాసిడర్ ఎవరు? అని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇంత చెప్పిన పూనమ్ ఆ వ్యక్తి పేరు కూడా చెబితే బాగుండేదని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హిందూ మతం గురించి, తిరుమల లడ్డూపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సమయంలో.. పూనమ్ ఈ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కి ఓ నెటిజన్ స్పందిస్తూ.. “మొదటిసారి మీ డైరెక్ట్‌ ఎటాక్ మోడ్ చూస్తున్నాం” అని కామెంట్ పెట్టగా, దానిపై ఆమె రియాక్ట్ అయ్యారు. “గౌరవనీయ సిటిజెన్, నేను ఎవ్వరిపైనా ఎటాక్ చేయడం లేదు. కేవలం తెలుసుకోవాలనే ఆసక్తితోనే ఈ వినయపూర్వకమైన ట్వీట్ చేశాను” అని రిప్లై ఇచ్చారు. అలానే మరో నెటిజన్ ట్వీట్ పై స్పందిస్తూ.. “తన పిల్లలకు 3 నెలల వయసులో బాప్టిజం ఇవ్వడం ద్వారా అతను తన వారసత్వాన్ని సనాతన కాథలిక్ క్రైస్తవ మతంలోకి ఎందుకు మార్చుకున్నాడు? పొలిటికల్ డ్రామాల్లో హిందువుగా ఉండటం అంటే దుస్తులు ధరించడం, విదేశాల్లో ఆ దుస్తులు మార్చడమా?” అని పూనమ్ ప్రశ్నించింది. * “యూపీలో దీన్ని లవ్ జిహాద్ అంటారు. ఏపీలో ఇది సెలెక్టివ్ గా మారుతుంది” అని పూనమ్ కౌర్ మరో పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో పూనమ్ ఇలానే కొన్ని పోస్టులు పెట్టి, ఆ తర్వాత డిలీట్ చేసింది. అందుకే నెటిజన్లు ఆమె పోస్టులను స్క్రీన్ షాట్ తీసుకొని మరీ నెట్టింట షేర్ చేస్తున్నారు. మరి పూనమ్ త్వరలోనే ఆ మత మార్పిడి రాయబారి ఎవరో అందరికీ అర్థమయ్యేలా డైరెక్ట్ గా చెబుతుందేమో చూడాలి.