కోల్‌కతాలోని మైదానంలో ఈ రోజు ఓ మినీ యుద్ధమే జరగనుంది. లో భాగంగా డూ ఆర్ డై మ్యాచ్‌లో తలపడుతున్నాయి. సెమీఫైనల్‌కు అర్హత సాధించే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడటం ఖాయం. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. భారత్ - వెస్టిండీస్ మధ్య ఉత్కంఠ పోరుకు ఈడెన్ గార్డెన్స్ వేదిక అయింది. సూపర్ 8లో చివరి మ్యాచ్ ఖావడం, ఈ మ్యాచ్ ఫలితం ఆధారంగానే సెమీస్ జట్టు ఫైనల్ కావడంతో గెలుపు కోసం ఇరు జట్లు తీవ్ర ప్రయత్నాలే చేస్తాయి. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్ స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. హెడ్ టు హెడ్టీ20 మ్యాచ్‌లలో భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య 30 మ్యాచ్‌లు జరిగాయి. అందులో టీమిండియా 19 మ్యాచ్‌లలో విజయం సాధిస్తే, వెస్టిండీస్ 10 మ్యాచ్‌లలో గెలిచింది. ఒక మ్యాచ్‌‌లో ఫలితం తేలలేదు. దాంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత్, వెస్టిండీస్ జట్లు ఒకేలా ప్రదర్శన చేస్తున్నాయి. గ్రూప్ స్టేజ్‌లో ఇరు జట్లు చెరి నాలుగు విజయాలతో టాప్ ప్లేస్‌లో నిలిచాయి. సూపర్ 8లో ఇరు జట్లు చెరొక మ్యాచ్‌లలో విజయం సాధించాయి. ఈ రెండు జట్లు కూడా సౌతాఫ్రికా మీదే ఓటమిపాలవ్వడం విశేషం. దాంతో మ్యాచ్ పోటాపోటీగా సాగే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా జట్టు అంచనాసంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్. వెస్టిండీస్ జట్టు అంచనాబ్రాండన్ కింగ్, షై హోప్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, రూధర్‌ఫోర్డ్, రోస్టన్ ఛేజ్, రొమారియో షెఫర్డ్, జేసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్/అకేలా హోసన్, గుడకేశ్ మోటీ, షమార్ జోసఫ్.