అఫ్గాన్‌పై యుద్ధం ప్రకటించిన పాకిస్థాన్.. అనేక నగరాలపై వైమానిక దాడులు

Wait 5 sec.

: పశ్చిమాసియాలో మరో యుద్ధ జ్వాల మొదలైంది. పొరుగు దేశాలైన పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. గత కొంతకాలంగా సరిహద్దు గొడవలతో సతమతమవుతున్న ఈ రెండు దేశాలు.. ఇప్పుడు నేరుగా ఒకరిపై ఒకరు యుద్ధం ప్రకటించుకున్నాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. "మా ఓపిక నశించింది. ఇది ఇకపై మీకూ మాకూ మధ్య బహిరంగ యుద్ధమే" అని ప్రకటించడం అంతర్జాతీయ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.'ఆపరేషన్ గజబ్-లిల్-హక్'.. పాక్ భీకర దాడులుగురువారం రాత్రి అఫ్గాన్ తాలిబన్ దళాలు ప్రతీకారంగా పాకిస్థాన్ తన గగనతల శక్తిని ప్రయోగించింది. '' పేరుతో అఫ్గాన్ రాజధాని కాబూల్, కాందహార్, పక్తియా ప్రాంతాల్లోని కీలక సైనిక స్థావరాలపై పాక్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో తాలిబన్లకు చెందిన రెండు బ్రిగేడ్ హెడ్ క్వార్టర్లతో పాటు భారీ ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు పాక్ ప్రకటించింది.అఫ్గాన్ ప్రతిఘటన.. ఎఫ్-16 కూల్చివేత?మరోవైపు తాలిబన్ ప్రభుత్వం కూడా పాకిస్థాన్‌కు గట్టిగానే బదులిస్తోంది. తమ భూభాగంలోకి చొరబడిన పాక్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు అఫ్గాన్ సైన్యం ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది. అలాగే పాక్‌కు చెందిన 19 సైనిక పోస్టులను స్వాధీనం చేసుకున్నామని, 55 మంది పాక్ సైనికులను హతమార్చామని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వెల్లడించారు.గందరగోళంలో మరణాల సంఖ్య..ఈ ఘర్షణల్లో ప్రాణనష్టానికి సంబంధించి ఇరు దేశాలు భిన్నమైన వాదనలు చేస్తున్నాయి. 55 మంది పాక్ సైనికులు మరణించారని, తమ వైపు కేవలం 8 మంది సైనికులు మాత్రమే చనిపోయారని అఫ్గాన్ చెబుతోంది. తాము కేవలం ఇద్దరు సైనికులనే కోల్పోయామని, 133 మందికి పైగా అఫ్గాన్ ఫైటర్లను మట్టుబెట్టామని పాక్ ప్రధాన మంత్రి ప్రతినిధి ప్రకటించారు. అయితే సరిహద్దుల్లో జరుగుతున్న ఈ రక్తపాతంలో సామాన్య ప్రజలు బలైపోతున్నారు. తోర్ఖం సరిహద్దు వద్ద ఉన్న శరణార్థి శిబిరంపై క్షిపణి పడటంతో మహిళలు, పిల్లలతో సహా 13 మంది గాయపడ్డారు. పాకిస్థాన్ నుంచి వెనక్కి వస్తున్న అభాగ్యులు ఇప్పుడు రెండు దేశాల కాల్పుల మధ్య చిక్కుకుని విలవిల్లాడుతున్నారు.ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాలు ఎంత ప్రయత్నించినా.. పాక్-అఫ్గాన్ మధ్య శాంతి నెలకొనడం లేదు. పాకిస్థాన్‌లో జరుగుతున్న ఉగ్ర దాడులకు (టీటీపీ) అఫ్గానిస్థానే ఆశ్రయం ఇస్తోందని ఇస్లామాబాద్ ఆరోపిస్తుండగా.. తమపై అనవసరంగా వైమానిక దాడులు చేస్తూ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్నారని తాలిబన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి రంగంలోకి దిగి పౌరులను రక్షించాలని, దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతోంది. అయినప్పటికీ సరిహద్దుల్లో తుపాకుల మోత ఆగడం లేదు.