అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా జరిపిన దాడుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. డౌన్‌టౌన్‌లోని ఖమేనీ కాంపౌండ్‌ లక్ష్యంగా శనివారం (ఫిబ్రవరి 28) ఉదయం జరిపిన క్షిపణి దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు, ఆ దేశానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం పక్కన పెడితే.. ఖమేనీ పేరుతో హైదరాబాద్ నగరంలో ఓ రోడ్డు ఉందనే విషయం తెలుసా..? నగరంలో ఓ రోడ్డు ఖమేనీ పేరుతో ఉందటా ఆ విషయాన్ని ఓ నెటిజన్ తన ఫేస్‌బుక్ పేజీలో వెల్లడించారు. అయితే అది ప్రస్తుతం చనిపోయిన అయతొల్లా అలీ ఖమేనీ పేరుతో కాదట. ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ ఇమామ్ అయోతుల్లా సయ్యద్ రుహోల్లా ముసావీ ఖమేనీ పేరుతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 'హైదరాబాద్‌లో ఇమామ్ ఖమేనీ రోడ్ ఉంది. ఆ రోడ్‌లోనే ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఉంది. ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ ఇమామ్ అయతొల్లా సయ్యద్ రుహోల్లా ముసావీ ఖమేనీ జ్ఞాపకార్థం ఈ పేరు పెట్టారు. మొదటి సుప్రీం లీడర్ ముసావీ ఖమేనీ చనిపోయిన తర్వాత అయతొల్లా అలీ ఖమేనీ ఇరాన్‌కు సుప్రీం లీడర్ అయ్యారు. కుతుబ్ షాహీల కాలం నుంచి హైదరాబాద్‌కు, ఇరాన్‌ దేశానికి మధ్య బలమైన చారిత్రక, సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఆ దౌత్యపరమైన బంధానికి గౌరవ సూచకంగా.. ఇరాన్ కౌన్సులేట్ ఉన్న ఆ రహదారికి ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడైన గ్రాండ్ అయతుల్లా రుహొల్లా ఖమేనీ పేరును మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (MCH) ఉన్నప్పుడు ఈ పేరు పెట్టారు. హైదరాబాద్‌లో ఏర్పాటైన మొదటి దౌత్యకార్యాలయాల్లో ఇరాన్ కూడా ఒకటి. జీవీకే మాల్ ఎదురుగా ఉన్న బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7నే ఇమామ్ ఖమేనీ రోడ్ అని పిలుస్తారు. ఇది అధికారికంగా ప్రభుత్వం పెట్టిన పేరు.' అని సదరు నెటిజన్ వెల్లడించారు. ఇక ఇరాన్‌ ఉన్నాయి. ఆయన పూర్వీకులు ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా కింతూరు గ్రామానికి చెందినవారట. ఖమేనీ తాత సయ్యద్‌ అహ్మద్‌ ముసావి కింతూరు గ్రామంలోనే 19వ శతాబ్దం ప్రారంభంలో జన్మించారు. ఆయన ఇండియా నుంచి ఇరాన్‌లోని నజఫ్‌కు బయలుదేరి 1834లో ఖొమేన్‌ నగరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారట. ఆ తర్వాతి కాలంలో ఆయన కుటుంబ వారసులు ఇరాన్‌లో రాజకీయ, మతపరంగా శక్తిమంతమైన నేతలుగా ఎదిగారు.