హైదరాబాద్ నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌లో రోడ్ నంబ‌ర్ 36లో మంగ‌ళ‌గౌరి బట్టల దుకాణంలో అకస్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. వేగంగా షోరూం మెుత్తం మంటలు వ్యాపించి భారీగా మంట‌లు ఎగిసిప‌డుతుండ‌టంతో ఆ ప్రాంత‌మంతా పొగ‌లు వ్యాపించాయి. పక్కనే ఉన్న బిల్డింగ్‌లకు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. స్థానికుల సమాచారం మేరకు వెంటనే ఫైర్ సిబ్బందికి అక్కడకు చేరుకున్నారు. ప్రస్తుతం మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. షోరూం ముందు ఏర్పాటు చేసిన టెంపుల్ సెట్‌లో ముందుగా మంటలు వచ్చినట్లు తెలిసింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇవాళ ఉదయం షోరూం తెరుస్తున్న సమయంలో అకస్మాత్తుగా నిప్పురవ్వలు చెలరేగి టెంపుల్ సెట్‌కు అంటుకున్నట్లు షోరూం సిబ్బంది తెలిపారు. టెంపుల్ సెట్ కొబ్బరి పీచు, ఫ్లాస్టిక్‌తో చేసింది కావటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అనంతరం షోరూం లోపలికి కూడా మంటలు వ్యాపించి ఖరైదన బట్టలు కాలిబూడిదయ్యాయి. భవనం మొత్తం మంటలు, దట్టమైన పొగతో నిండిపోగా.. పక్క బిల్డింగ్‌లోని వాళ్లు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు భారీగా ఎగిసి పడుతుండటంతో రోడ్డుపై నుండి వెళ్లే వాహనాలను ఎక్కడికక్కడ ఆగిపోవటంతో కాస్త ట్రాఫిక్ జాం ఏర్పడింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో షోరూంలో ఎవరూ లేరు. మంటలు వ్యాపించగానే సిబ్బంది అంతా బయటకు వచ్చేశారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. భారీగా ఆస్తి నష్టం మాత్రం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.కాగా, హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నీచర్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మెుత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత నాంపల్లిలోని జరిగింది. ఈ ఘటనలో పోలీస్ శాఖకు చెందిన కీలక ఫైల్స్, డేటా అగ్నికి ఆహుతైంది. ప్రస్తుతం ఎండాకాలం సమీపిస్తుండటంతో అగ్ని ప్రమాదాలు జరిగి అవకాశం ఎక్కువగా ఉందని.. జాగ్రత్తలు తీసుకోవాలని ఫైర్ సెఫ్టీ అధికారులు సూచిస్తున్నారు.