కొత్తగా 5 వేల అంగన్వాడీ సహాయకుల నియామకం.. మంత్రి కీలక ప్రకటన

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వినిపించింది. రాష్ట్రంలో మినీ అంగన్వాడీ కార్యకర్తలకు అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్లు కల్పించనున్నట్లు ఏపీ హోం మంత్రి వివరించారు. రాష్ట్రంలోని ఐదువేల మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్అప్ గ్రేడ్ చేస్తున్నామన్న హోం మంత్రి.. అందులో భాగంగా మినీ అంగన్వాడీ కార్యకర్తలకు.. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి ఇచ్చి. పూర్తిస్థాయిలో వేతనాలు అందించనున్నట్లు తెలిపారు. ఆలాగే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 5 వేల అంగన్వాడీ సహాయకుల నియమించనున్నట్లు మంత్రి అనిత వివరించారు. సచివాలయంలో అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడిన హోం మంత్రి అనిత.. అంగన్వాడీ సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీ వేతనాలను రెండుసార్లు పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని మంత్రి అనిత తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని.. అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ. 86.68 లక్షలు విడుదల చేసిన సంగతిని గుర్తు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఉన్న 58,204 మంది , సూపర్‌వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకువివరించారు. ఈ ఫోన్ల ద్వారా మరింత వేగంగా సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. అంగన్వాడీల గ్రాట్యుటీ కలను నిజం చేశామని.. గ్రాట్యుటీ చెల్లింపుల కోసం బడ్జెట్‌లో రూ. 20 కోట్లు కేటాయించినట్లు మంత్రి అనిత తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తల డిమాండ్లలో తొమ్మిదింటిని పరిష్కరించినట్లు తెలిపారు. వేతనాల పెంపు అంశాన్ని కూడా త్వరలోనే అమలు చేస్తామన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నప్పటికీ.. ఉద్యోగుల సంక్షేమంలో రాజీ పడటం లేదని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని.. వీలైనంత త్వరగా వేతనాల పెంపు అంశాన్ని కూాడా పరిష్కరించి అమలుచేస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు.