యాంకర్ శ్రీముఖి హోస్టుగా.. బిగ్‌బాస్, సీరియల్ సెలబ్రెటీ కపుల్స్‌తో ఒక బ్రాండ్ న్యూ షో ప్రారంభమవుతుందన్న సంగతి తెలిసిందే. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' పేరుతో రాబోతున్న ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా వదిలారు. ఇందులో ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్న కొన్ని జంటలని రివీల్ చేశారు. అలానే షో ఎలా ఉండబోతుందనేది హోస్ట్ శ్రీముఖి చెప్పుకొచ్చింది.కపుల్స్ లిస్ట్ ఇదేఈ ప్రపంచంలో చాలా రకాల రిలేషన్స్ ఉంటాయ్.. కొన్ని ప్రేమతో నడుస్తాయ్.. మరికొన్ని నమ్మకంతో.. ఇంకొన్ని అడ్జస్ట్‌మెంట్స్‌తో.. అంటూ శ్రీముఖి ప్రోమోని స్టార్ట్ చేసింది. మా రిలేషన్‌షిప్ మొత్తం నమ్మకం మీదే నడుస్తుంది.. అంటూ సోనియా సింగ్ తన ప్రియుడు కనిపించారు. మేము చాలా అడ్జస్ట్ అవుతాం.. అదే మా బలం.. అంటూ ప్రియాంక జైన్-శివకుమార్ హలో చెప్పారు.నిజం చెప్పాలంటే మేమే బెస్ట్ కపుల్.. అంటూ వాసంతి తన భర్త పవన్ కళ్యాణ్ మెరిశారు. అన్ని రిలేషన్స్ బయటి నుంచి పర్ఫెక్ట్‌గానే కనిపిస్తాయ్.. కానీ.. అని శ్రీముఖి గ్యాప్ ఇవ్వగనే.. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కపుల్స్ అందరూ టెన్షన్‌గ చూశారు. కానీ ఏంటి చెప్పండి.. అంటూ సీరియల్ నటి సాండ్రా జైచంద్రన్ అడిగింది. మీ రిలేషన్‌షిప్స్ అన్నీ ఒకటే దగ్గర టెస్ట్ చేస్తే.. 10 సెలబ్రెటీ కపుల్స్.. 10 వారాలు.. ఒక లగ్జరీ విల్లా.. అందుకే మేము ఒక బ్రాండ్ న్యూ షోతో మీ ముందుకొస్తున్నాం.. రండి కలిసి చూద్దాం.. ఏ రిలేషన్‌షిప్ బెస్ట్ అని.. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్.. డోంట్ మిస్ ఇట్.. అంటూ శ్రీముఖి చెప్పింది. ఇక ఈ ప్రోమోలో శాండ్రా తన భర్త మహేష్ బాబు కాళిదాసు, అలానే బిగ్‌బాస్ 9 ఫేమ్ మాస్క్ మ్యాన్ హరీష్ తన భార్య హరిత, అంజలి పవన్ కూడా కనిపించారు. వీరితో పాటు నటరాజ్ మాస్టర్-నీతు, జబర్దస్త్ నూకరాజు జంట, బిగ్‌బాస్ ఫేమ్ శుభశ్రీ రాయగురు తన భర్త కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్నట్లు సమాచారం.మొత్తానికి 10 వారాల పాటు ఒక విల్లాలో ఈ 10 జంటలని ఉంచబోతున్నారు. బిగ్‌బాస్ తరహాలానే ఇది కూడా రియాలిటీ షోనే. బిగ్‌బాస్ అయితే అందరూ సింగిల్‌గా లోపలికి వెళ్తారు.. నచ్చినవాళ్లు రిలేషన్‌షిప్ పెట్టుకుంటారు.. కానీ ఇక్కడ వెళ్లేవాళ్లే జంటలుగా వెళ్తున్నారు. ఇందులో కొంతమంది భార్యభర్తలు కాగా, కొంతమంది రిలేషన్‌లో ఉన్నవాళ్లు. మరి ఈ షోలో ఏం టెస్ట్ చేస్తారో.. ఎలా ఉంటుందో చూడాలి మరి. జియో హాట్‌స్టార్, స్టార్ మాలో ఈ షో ప్రసారం కాబోతుంది.