హాస్పిటల్ బెడ్‌పైనే రింకూ సింగ్ తండ్రి మృతి.. కన్నీళ్లు పెట్టించే వార్త, హర్భజన్ ఎమోషనల్ పోస్ట్!

Wait 5 sec.

. స్టేజ్- 4 క్యాన్సర్‌తో పోరాడుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన గ్రేటర్ నోయిడాలోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఉండగా, ఇటీవల ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు.. మృత్యువుతో పోరాడిన ఆయన ఇవాళ మరణించారు. . త్వరలోనే పెళ్లి ఉందనగా తండ్రి మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాద సమాచారాన్ని మాజీ భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రింకూ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, హృదయపూర్వక ప్రార్థనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వార్త విన్న టీమిండియా క్రికెటర్లు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.తండ్రి అనారోగ్యం కారణంగా రింకూ ఇటీవల ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్ -8 మ్యాచ్‌కు ముందు జట్టు శిబిరాన్ని తాత్కాలికంగా వదిలి వెళ్లాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌కు ముందు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వద్ద తిరిగి జట్టుతో చేరినప్పటికీ, తుది జట్టులో అతడికి అవకాశం దక్కలేదు. అతడి స్థానంలో చివరి నిమిషంలో సంజూ శాంసన్‌కు చోటు కల్పించారు.హర్భజన్ తన పోస్ట్‌లో “రింకూ తండ్రి మృతి విషయం తెలుసుకుని చాలా బాధపడ్డాను. ఈ కష్ట సమయంలో కూడా రింకూ జట్టు బాధ్యతల పట్ల నిబద్ధతతో ఉన్నాడు. దేవుడు ఆయన ఆత్మకు శాంతిని ప్రసాదించి, కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.రింకూ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. అలీగఢ్‌లో ఎల్పీజీ సిలిండర్ డెలివరీ ఉద్యోగం చేస్తూనే, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కుమారుడికి క్రికెట్‌లో ముందుకు వెళ్లేందుకు పూర్తి సహకారం అందించారు. గత ఏడాది రింకు తన తండ్రికి రూ.3.19 లక్షల విలువైన కవాసాకి నింజా బైక్‌ను బహుమతిగా ఇచ్చిన విషయం కూడా అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. ఈ విషాదం క్రికెట్ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించగా, పలువురు ఆటగాళ్లు కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.