శ్రీవారి భక్తులకు గమనిక.. తిరుమలలో ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ రద్దు..

Wait 5 sec.

తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మార్చి 1, 2వ తేదీల్లో స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. మార్చి మూడో తేదీ చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి 2, 3వ తేదీలలో దర్శనాల కోసం తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయరని టీటీడీ ప్రకటించింది. ఆయా రోజులకు సంబంధించిన ఎస్‌ఎస్‌డీ టోకెన్లు ముందురోజ అంటే మార్చి 1, 2వ తేదీల్లో జారీ చేయరని క్లారిటీ ఇచ్చింది. మార్చి నాలుగో తేదీ శ్రీవారి దర్శనాలకు సంబంధించిన SSD టోకెన్లను మార్చి 3వ తేదీ యథావిధిగా జారీ చేస్తామని తెలిపింది. అలాగే చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి మూడో తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఈ కారణంతో మార్చి రెండో తేదీన వీఐపీ సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించదు. మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం.. మూతపడనున్న శ్రీవారి ఆలయం మార్చి మూడో తేదీ చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల ఆలయాన్ని . చంద్రగ్రహణం మార్చి మూడో తేదీ సాయంత్రం 3 గంటల 20 నిమిషాలకు ప్రారంభం కానుంది. సాయంత్రం 6.47 గంటలకు పూర్తవుతుంది. అయితే గ్రహణ సమయానికి 6 గంటల ముందే ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఉదయం తొమ్మిది గంటలకే తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు.గ్రహణం విడిచిన తర్వాత సాయంత్రం 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. అనంతరం శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించి.. 8 గంటల 30 నిమిషాల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ‌ తేదీ అష్టదళ పాద పద్మారాధన సేవ, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనాలు, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులకు కల్పించే దర్శనాలను రద్దు చేశారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ కోరింది. చంద్రగ్రహణం సందర్భంగా తిరుపతి, తిరుచానూరులోని టీటీడీ మూసివేయనున్నారు.