దుబాయ్‌లో మంచు విష్ణు ఫ్యామిలీ.. ఆకాశంలో దూసుకొస్తున్న ఇరాన్ మిస్సైల్స్.. వీడియో వైరల్

Wait 5 sec.

ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ఇరాన్‌పై చేస్తున్న దాడులు.. తిరిగి ఇరాన్ చేస్తున్న ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇరాన్ దెబ్బకు గల్ఫ్ దేశాల రాజధానులైన దుబాయ్, రియాద్, అబుదాబీ, దోహా, మనామా నగరాలు వణికిపోతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌లోని దుబాయ్‌పై ఇరాన్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో షేర్ చేశారు. మంచు విష్ణు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో ఉన్నారు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి దెబ్బకు తాను నివసిస్తున్న ఇల్లు షేక్ అయిందని ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఆకాశంలో ఇరాన్‌ మిస్సైల్స్ దృశ్యాలను పంచుకున్నారు. ఆ క్షిపణుల భారీ శబ్దాలు తన కుమార్తె ఐరాను భయపెట్టాయని చెప్పారు. ఎవరూ ఇలాంటి యుద్ధ వాతావరణంలో పెరగకూడదని అన్నారు. శాంతి కోసం ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.“ఈ రాత్రి దుబాయ్‌లో కుటుంబ సభ్యులతో ఉన్నాను. ఆకాశంలో కనిపిస్తున్న క్షిపణుల వల్ల మేము ఉన్న ఇల్లు కంపించింది. ఆ శబ్దాలకు ఐరా చాలా భయపడింది. శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. ఏ బిడ్డ కూడా యుద్ధ శబ్దం విని పెరగకూడదు. పౌరులను సురక్షితంగా ఉంచినందుకు యుఎఇ రక్షణ దళాలకు కృతజ్ఞతలు. ఇలాంటి క్షణాలు జీవితం నిజంగా ఎంత దుర్బలమైనదో మనకు గుర్తు చేస్తాయి. బలం కోసం, శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. హర్ హర్ మహాదేవ్” అని మంచు విష్ణు పేర్కొన్నారు.విష్ణు షేర్ చేసిన వీడియోలో ఇరాన్ ప్రయోగించిన మిస్సైల్స్ దుబాయ్‌ గగనతలంలోకి దూసుకురావడం కనిపించింది. ఆ సమయంలో విష్ణుతో పాటుగా ఫ్యామిలీ సభ్యులు భయపడుతున్నట్లు అర్థమవుతోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంచు విష్ణు కుటుంబం సేఫ్ ఫ్లేస్ లో ఉండాలని, సురక్షితంగా ఇండియాకి తిరిగిరావాలని అభిమానులు కోరుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండమని కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాల సంయుక్త సైనిక ఆపరేషన్‌ తో పశ్చిమాసియాలోని భారత రాయబార కార్యాలయాలు అప్రమత్తమయ్యాయి. భారత పౌరులు అత్యంత జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, స్థానిక అధికారులు ఇచ్చిన సూచనలను పాటించాలని పేర్కొన్నాయి. ఈ మేరకు యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్‌ తదితర దేశాల్లోని ఇండియన్ ఎంబసీలు అడ్వైజరీలు జారీ చేశాయి.యూఏఈలో ఉన్న భారత పౌరులు అనవసర ప్రయాణాలు మానుకోవాలని, అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటూ అధికారులు ఇచ్చిన భద్రతా మార్గదర్శకాలు పాటించాలని అక్కడి భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మరోవైపు . తదుపరి నోటీసులు జారీ చేసేవరకూ దుబాయ్, ఆల్ మక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో లక్షలాదిమంది ప్రయాణికుల విమానాశ్రయంలో వేచి ఉన్నారు.