శ్రీలంకపై ఇలా గెలిస్తేనే పాకిస్తాన్‌కు సెమీస్ ఛాన్స్.. 13.1 ఓవర్లలో ఛేజ్ చేయడం పాక్‌కు సాధ్యమేనా?

Wait 5 sec.

. శుక్రవారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో , అనుకోకుండా పాకిస్తాన్‌కు పెద్ద సహాయం చేసింది.ఈ ఫలితంతో పాకిస్తాన్ జట్టు ఇంకా టోర్నీలో నిలిచింది. కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని జట్టు ఇప్పుడు చివరి మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌కు చేరే అవకాశం ఉంది. మరోవైపు, న్యూజిలాండ్ సూపర్ ఎయిట్ దశను ముగించింది. మూడు మ్యాచ్‌లలో వారికి మూడు పాయింట్లు, నెట్ రన్‌రేట్ +1.390గా ఉంది.పాకిస్తాన్ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లో ఒకే ఒక పాయింట్ మాత్రమే సాధించింది. వారి నెట్ రన్‌రేట్ -0.461గా ఉంది. శనివారం శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ తప్పనిసరిగా గెలవాలి. అంతేకాదు, న్యూజిలాండ్ నెట్ రన్‌రేట్‌ను మించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్. ప్రేమదాస క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లైవ్ స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.పాకిస్తాన్ బ్యాటింగ్ ముందుగా చేస్తే కనీసం 64 పరుగుల తేడాతో గెలవాలి. లేదా ఛేజింగ్ చేస్తే 13.1 ఓవర్లలోపు టార్గెట్‌ను పూర్తి చేయాలి. అప్పుడే సెమీఫైనల్ బెర్త్ ఖాయం అవుతుంది. గతంలో పాకిస్తాన్-న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఇరుజట్లకు ఒక్కో పాయింట్ వచ్చింది.అనంతరం న్యూజిలాండ్ శ్రీలంకపై 61 పరుగుల తేడాతో గెలిచింది. పాకిస్తాన్ మాత్రం ఇంగ్లండ్ చేతిలో రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఒకవేళ న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి ఉంటే, ఐదు పాయింట్లతో నేరుగా సెమీస్‌కు వెళ్లేది. అప్పుడు పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించేది. కానీ ఇంగ్లండ్ విజయం వల్ల పాక్‌కు మరో అవకాశం లభించింది. ఇప్పుడు శ్రీలంకపై ఫలితం పాకిస్తాన్ భవితవ్యాన్ని నిర్ణయించనుంది. గెలుపుతో పాటు నెట్ రన్‌రేట్ కూడా కీలక పాత్ర పోషించనుంది.