Proterial Steel plant: ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. ఎలక్ట్రికల్ స్టీల్ సిటీ.. దేశంలోనే తొలిసారిగా..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరో కీలక ప్రాజెక్టు రానుంది. దేశంలోనే తొలి అమోర్ఫోస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ ఏపీలో ఏర్పాటు కానుంది. అమెరికా-జపాన్‌ సంయుక్త సంస్థ అయిన ప్రొటీరియల్‌ కంపెనీ.. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ప్రొటీరియల్ ఇండియా సంస్థ.. ఎలక్ట్రికల్‌ స్టీల్‌ సిటీ ఏర్పాటు చేయనుంది. రూ.1350 కోట్ల పెట్టుబడితో మెట్‌గ్లాస్‌ ఇండియా పేరు మీద శ్రీసిటీలో ఈ ఎలక్ట్రికల్ స్టీల్ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రొటీరియల్ సంస్థ ప్రకటించింది. ఈ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ ద్వారా.. అల్లాయ్‌ రిబ్బన్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారుగా 200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఎలక్ట్రికల్ స్టీల్ సిటీ నిర్మాణాన్ని 2026 అక్టోబర్‌ నాటికి పూర్తి చేసి.. అప్పటి నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ప్రొటీరియల్ సంస్థ సీఈవో శాన్‌స్టాక్‌ వెల్లడించారు. స్టీల్ ప్లాంట్‌లో అధునాతన జపాన్‌ టెక్నాలజీలో వినియోగిస్తామని కంపెనీ వెల్లడించింది. తొలిదశలో ఏటా 30వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని అధికారులు చెప్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహకాలు, ప్రభుత్వ పారిశ్రామిక విధానం కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రొటీరియల్ సంస్థ కూడా ముందుకొచ్చింది. మార్చి 7 ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనమరోవైపు అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానున్న ఖరారైంది. మార్చి ఏడో తేదీన ఆర్సెలార్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్‌ ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. రూ.1.35 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఎకరా రూ.51,39,690 ధర చొప్పున ఏపీ ప్రభుత్వం ఇప్పటికే భూమి కూడా కేటాయించింది. రెండు దశల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు రచించారు. అనకాపల్లి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు.